తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ ఎందుకు మాట్లాడరుజనసేన
జనరల్ బాడీ సమావేశంలో నేతలపై పవన్ కల్యాణ్ ఫుల్ సీరియస్
జనరల్ బాడీ సమావేశంలో నేతలపై పవన్ కల్యాణ్ ఫుల్ సీరియస్
జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా, పార్టీ నుంచి ఒక్క నాయకుడు కూడా స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు.
“అన్నింటికీ నేనే మాట్లాడాలా? మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పాలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఎందుకు ఉన్నారు?” అంటూ పవన్ తీవ్రంగా నిలదీశారు.
అదే సమయంలో వైసీపీ నేతల వ్యాఖ్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్లో పడవద్దని హెచ్చరించారు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. భావోద్వేగాలతో కాకుండా సిద్ధాంత పరంగా, సబ్జెక్ట్పై మాత్రమే మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు.
వ్యక్తిగత వ్యవహారాల్లో జాగ్రత్త అవసరమని, మీ చర్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని పవన్ స్పష్టం చేశారు. “అందరి చిట్టా నా దగ్గర ఉంది” అంటూ నేతలను హెచ్చరించారు. ఆగ్రహంతో సమావేశాన్ని మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు. తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై నివేదిక ఇవ్వాలని నాదెండ్ల మనోహర్కు ఆదేశించారు.